Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Sunday, November 12, 2023

Yadadri Karthika Masam Satyanarayana Vratham 2023 Schedule | యాదాద్రి కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతం | Satyanarayana Vratham Yadadri Online Booking Available


Yadadri Sri Lakshminarshima Swamy Devasthanam, Yadadri Yadagirigutta during Coming  Kartheeka masam. Keeping in mind the demand, increased the batches of Satyanarayana Swamy Vratham from present four to six per day during the month Karthika Masam 2023. these all satyanarana swamy vrathams will be performed at  New Satayanarayana Vrtha Mandapam, Near 3rd Ghat Road Entrance, Down Hill, Yadagirigutta everyday in this month starting from 14th November 2023 to 12th December 2023. 

Now Online Booking also available, dovotee can purchase tickets at https://yadadritemple.telangana.gov.in/ 
 
 
Vratham Batch Timings 
Every Day 6 Batches in this month : 
  1. 6:30 AM TO 7:30 AM

  2. 8:30 AM TO 9:30 AM

  3. 10:30 AM TO 11:30 AM

  4. 12:30 PM TO 1:30 PM

  5. 2:30 PM TO 3:30 PM

  6. 4:30 PM TO 5:30 PM 

 

#yadadri #yadagirigutta yadadri satyanarayana Vratham 


 

 


Read more...

Sunday, August 20, 2023

యాదాద్రి జర్నలిస్ట్ రాగి సహదేవ్ కు గౌరవ డాక్టరేట్



యాదాద్రి జర్నలిస్ట్ రాగి సహదేవ్ కు గౌరవ డాక్టరేట్

* జర్నలిజం. కవిత్వం.సామాజిక సేవలకు విశిష్ట గుర్తింపు
* చెన్నైలో జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం లో ' డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ' అవార్డ్ స్వీకరణ
 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ ను ' డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ' అవార్డ్ వరించింది. చెన్నైలో 'జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ' వారు తమ 14వ స్నాతకోత్సవం లో ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసారు. ఎంపవర్ మైండ్స్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ (ఎల్ ఎల్ పి) ఫౌండర్ చైర్ విమెన్ డాక్టర్ లతా మూర్తి, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలందిస్తున్న అపిటికో లిమిటెడ్ బిజినెస్ ఆఫీసర్, రూపేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్, ఎండి డాక్టర్ కండ్ల గుంటి బాబు తదితరులు స్నాతకోత్సవ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

1981లో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఉదయం దినపత్రికలలో పత్రికా రచన (జర్నలిజం) ప్రారంభించిన రాగి సహదేవ్ అంచెలంచెలుగా ఎదిగారు. రాజధాని హైదరాబాద్ లో ఉషోదయం, కృష్ణాపత్రిక,నేటి మనదేశం, స్కైలైన్, ప్రజాపోరాటం తదితర ఆంగ్ల, తెలుగు దినపత్రికలు,పలు వార్తా సంస్థలలో స్టాఫ్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, చీఫ్ సబ్ ఎడిటర్, రెసిడెంట్ ఎడిటర్ గా నాలుగు దశాబ్దాలకు పైగా పత్రికా రచనలో నిమగ్నమై న రాగి సహదేవ్ తన వృద్ధాప్యంలో నూ యాదగిరిగుట్ట ఆంధ్రప్రభ గ్రామీణ విలేకరిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో విశాఖలో ' యాదాద్రి పత్రికారత్న ' అవార్డును ఆయన అందుకున్నారు.

'యాదగిరిగుట్ట జంటకవులు' గా ప్రసిద్ధి

స్థానిక జర్నలిస్ట్ , తెలంగాణ మాండలిక కవి చెన్నోజు ఉప్పలాచారి తో కలిపి ' యాదగిరిగుట్ట జంటకవులు ' గా ఆచార్య దివాకర్ల వెంకటావధాని చే బిరుదాంకితులైన రాగి సహదేవ్ తెలంగాణ మాండలికంలో నాటికను రచించి,ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించి పలు అవార్డులు పొందారు. ' కవితా జానపదం ' పుస్తకాన్ని వెలువరించారు. అదేవిధంగా స్థానికంగా సామాజిక సమస్యల పోరాటాలలో ఆయన భాగస్వామ్యులయ్యారు.


ప్రముఖుల అభినందనలు

ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ బోధానందగిరి స్వామిజీ, కవులు, జర్నలిస్టులు తదితరులు ఆయనను ఈ సందర్బంగా అభినందించారు.

 

Read more...

Thursday, July 27, 2023

Incomplete Road Works Causing problems in Yadagirigutta Town | అసంపూర్ణ పనులతో యాదగిరిగుట్ట ఆగమాగం

 


రోడ్డు విస్తరణ తరువాత పట్టణంలో పూర్తి కానీ రహదారుల పనులు

కొండపైనుంచి, రింగ్ రోడ్ పైనుంచి వచ్చే నీళ్ళని పట్టణంలోనికి మళ్లింపు

లోతట్టు ప్రాంతాలుగా మారుతున్న పట్టణ వీధులు

సి ఏం ప్రకటించిన మొదలు కానీ రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్

అద్వానంగా గాంధీనగర్, యాదగిరిపల్లి, పాతగుట్ట ప్రదాన రహాదారులు  

యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణ, ఆలయ పునః ప్రారంమభమై సంవత్సరం దాటుతున్న పట్టణంలోని రహదారుల పనులు పూర్తి కాక పోవడంతో పట్టణం చాలా అద్వానంగా, ప్రమాదకరంగా మారుతుంది. కొండ మీద నుంచి వర్షాలకు వచ్చే నీళ్లకు సరి అయిన దారి లేకపోవడంతో అవి రింగ్ రోడ్డు మీదికి వచ్చి అటునుంచి పట్టణంలోని వీదుల్లో ప్రవహస్తు పట్టణాన్ని ఒక లోతట్టు ప్రాంతంగా మార్చి వేస్తుంది. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన రెయిన్ వాటర్ డ్రైన్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పనులు పట్టణంలో ఇంతవరకు మొదలు కాలేదు.

యాదగిరిగుట్ట ప్రకృతి సిద్దంగా కొండలు, చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతం, పూర్వీకులు చాలా దూరదృష్టితో పట్టణానికి చుట్టూరా యాదగిరిపల్లి చెరువు, గుండ్లపల్లి చెరువు, గండి చెరువు, ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది, చుట్టూ కొండలపై నుంచి పడే వర్షపు నీరు నేరుగా ఆయా చేరువులలోకి వెళ్ళే విధంగా ఏర్పాటులు చేసినట్టు అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. రోడ్డు విస్తరణ, రింగ్ రోడ్డు నిర్మాణం తరువాత ఈ సిస్టమ్ అంతా కనుమరుగైపోయింది. గతంలో ప్రధాన రహదారిలో కొండపైనుంచి వచ్చే వరద వైకుంఠ ద్వారం దగ్గర నుంచి నేరుగా బస్టాండ్ దగ్గర ఉన్న నాలా లోకి వెళ్లిపోయేది, ప్రస్తుతం రోడ్డు పనులు పాతగుట్ట చౌరస్తా వరకే జరిగి ముందుకు సాగడంలేదు, రోడ్డుకు ఇరువైపుల సర్వీసురోడ్డు, దాని ప్రక్కన వరద కాలువ నిర్మాణాలు కూడా అంత వరకే ఉన్నాయి, ఈ పనులు పూర్తికాకపోవడంతో, హనుమాన్ గుడి వద్ద కొండ పైనుంచి వచ్చే నీటిని ప్రక్కనే ఉన్న వరుద కాలువ లోకి మళ్లించకుండా కాలువను మూసి వేశారు, ఆ నీరంత పట్టణంలోని వీధులలోకి చేరుతుంది, భారీ వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్ళు చేరే పరిస్థితిలు ఉన్నాయి. 

పాత రిజిస్ట్రేషన్ ఆఫీసు, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద రింగ్ రోడ్డు పైనుంచి వచ్చే వరద నీరు రోడ్డు పై ఉన్న డ్రైన్ ల నుంచి నేరుగా వెళ్లిపోవాలి, కానీ ఎత్తు పల్లలా ను సరిగా చూసి నిర్మించని కారణంగా ఆ నీరంత రింగ్ రోడ్డు క్రింద ఉన్న యాదగిరిపల్లి రోడ్డు లోకి ప్రవహిస్తున్నది. అలాగే అక్కడే ఉన్న పాత కల్వర్టు స్థానం లో కొత్తది నిర్మించకపోవడం వలన వర్షం వచ్చినపుడల్లా నీళ్ళు రోడ్డు పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

ఇవి కొన్ని మాత్రమే, రోడ్డు విస్తరణ తో ఎన్నో కొత్త ఇబ్బందులు పట్టణంలో ఏర్పడ్డాయి, ముఖ్యంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ తో పట్టణం రెండు గా విడిపోయింది, ఇరువైపులా రాక పోకలు సాగించడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, భారీ వాహనలు వచ్చే పరిస్థితిలేదు, వైకుంఠ ద్వారం నుంచి గాంధీనగర్ వైపు లింకు రోడు వేస్తామని ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు, జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలకు, గోశాలకు వెళ్ళడానికి పట్టణంలోంచి నేరుగా దారిలేదు, గాంధీనగర్ వద్ద మరో అండర్ పాస్ నిర్మించి వీటికి దారులు ఏర్పర్చలని స్థానికులు కోరుతున్న పట్టించుకునే వారే కరువైనారు.  

ఇప్పటికైన అదికారులు స్పందించి, అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను,  ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు  అండర్ గ్రౌండ్ వాటర్, అండ్ డ్రైన్ పనులను పూర్తి చేయలని స్థానికులు కోరుతున్నారు. 

Read more...

Wednesday, July 5, 2023

TS Govt Sanctioned Govt Medical College for Yadadri | యాదాద్రికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుమతి

h యాదాద్రి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ 

h విద్యార్థులకు 100 ఎంబిబిఎస్ సీట్లు 

h 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగానే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు, ఈ కాలేజీని యాదాద్రి పట్టణం లో ఏర్పాటు చేసి, ఇక్కడ ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ ఆసుపత్రి కి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రాబోయే ఈ మెడికల్ కాలేజీకి 100 MBBS సీట్ల విద్యార్థుల కోసం కేటాయించారు. 

ఇందుకుగాను GO NO.85, DATED 05-07-2023 విడుదల చేస్తూ, దీని భవన నిర్మాణము, సాంకేతిక ఏర్పాట్లు, పరిపాలన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, మేనేజింగ్ డైరెక్టర్ TSMSIDC, ఇంజనీర్ ఇన్ చీఫ్ R&B వారిని ఆదేశించారు. 


గత నవంబర్ లోనే,  యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) ని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అబివృద్ది చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విదాన పరిషత్ నిర్ణయం తీసుకుంది, ఇందుకు సంబందించి GO No.722, dated 29-11-2022 ని విడుదల చేస్తూ, అభివృద్ది పనుల కోసం 45.79 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిర్మాణానికి సంబందించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావ్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగిపోయింది, అయితే అదే రోజు ఆసుపత్రి స్థల సేకరణ విషయంలో హరీష్రావు గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, పట్టణానికి దగ్గర గా ఉండే స్థలాలు చూడామని కొరినట్టు వార్తలొచ్చాయి. 

ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి అనుసంధానం కావాలంటే మరింత స్థలం అవసరం అయ్యే అవకాశముంది, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, సిబ్బందికి వసతి, విద్యార్థులకు హాస్టల్, తదితర నిర్మాణాలు చేయాల్సి వస్తుంది, స్థానిక అడికారులు, నేతలు ఏ స్థలాన్ని నిర్ణయిస్తారో వేచి చూడాలి. ప్రతిపాదిత ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు ఇక్కడి విద్యార్థులకు మరింత స్పూర్తి దాయకన్నీ ఇస్తుంది, డాక్టర్ చదువు కోసం ఎక్కడి కొ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే చదువుకొనే వెసులుబాటు వస్తుంది. 

యాదగిరిగుట్ట కు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినందుకు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లను కలిసి యాదగిరి గుట్ట లో వైద్య కళాశాల ఏర్పాటు ఆవశ్యకత ను వివరించిన్నట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం గా ఉందన్నారు. స్వామి వారి ఆలయానికి వివిధ దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా పెరిగిపోయారని, వైద్య కళాశాలతో పాటు 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం హార్శించదగ్గ విషయమన్నారు. త్వరలో గుట్టలో కళాశాల ఏర్పాటు కు కావాల్సిన స్థలాన్ని సేకరించి ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి లకు ప్రభుత్వ విప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read more...

Wednesday, May 31, 2023

India's First Brahmana Sadan in Hyderabad | ధూపదీప నైవేధ్య పథకం అర్చకులకు నెలకు రూ.10,000 | దేశంలోనే మొట్ట మొదటి బ్రాహ్మణ సదనం

👉దేశంలోనే మెట్టమొదటిసారి నిర్మించిన తెలంగాణ “బ్రాహ్మణ సదనం”

👉వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంపు.

👉ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గింపు.

👉రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం.

👉ఈ పథకం కింది అర్చకులకు నెలకు ఇచ్చే రూ.6 వేలను రూ.10 వేలకు పెంపు.

👉వేద పాఠశాలల నిర్వహణకు రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తాం.

👉విప్రహిత బ్రాహ్మణ సదనం హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల తో నిర్మాణం

👉ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులు బ్రాహ్మణ పరిషత్కు కేటాయింపు. 

బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారి నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రప్రథమం. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

గోపనపల్లిలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన 'విప్రహితబ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పాల్గొన్నారు. ముందుగా యాగశాలకు చేరుకొని, ప్రారంభోత్సవానికి దేశం నలుమూలలనుంచి ఆహ్వానం మేరకు హాజరై ఆసీనులైన పీఠాధిపతుల వద్దకు వెళ్లి వారిని పేరు పేరునా పలకరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎంకు వారు కిరీటం ధరింపచేసి, దుశ్శాలువాలు కప్పిసాంప్రదాయ పద్దతిలో శంఖం పూరించి వేదమంత్రాలతో సిఎంకు ఆశీర్వచనాలందించారు.


అక్కడనుంచి ప్రాంగణంలోనే మరో పక్కకు ఆసీనులైవున్న వేదపండితుల దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుని వారి దీవెనలూ సిఎం తీసుకున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానితులుగా వచ్చిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేతలను కలిసి వారితో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుకున్నారు.

అనంతరం ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం, వాస్తుపూజ కార్యక్రమాల్లో సిఎం పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న సందర్భంలో వేదమంత్రాల నడుమ కొనసాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. దాంతో నిన్నటి నుంచి కొనసాగుతున్నపూజాకార్యక్రమాలు ముగిసాయి.

అనంతరం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాన్ని సిఎం తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికవద్దకు సిఎం చేరుకున్నారు. ఉదయం 11.35 నిమిషాలకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు శ్రీ కెవి రమణాచారి సభను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి కోరగా సిఎస్ ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమైంది. అనంతరం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేరళకు చెందిన శ్రీ ప్రదీప్ జ్యోతి మాట్లాడారు. దేశంలోనే మరెక్కడాలేని విధంగా అత్యంత గొప్పగా బ్మాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమం పట్ల ఆలోచన చేస్తూ పలు పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారేనని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

బ్రాహ్మణ సంక్షేమ సదనంప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం - ముఖ్యాంశాలు:

ఈనాటి శుభసందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను ఆడియో సందేశం ద్వారా మనకందించినటువంటి, ఆశీర్వదించినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి, వారి చరణ పద్మాలకు వందనాలు. అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికి చరణాభి వందనాలు.

సభలో ఆశీనులైన విప్రవర్యులు, బ్రాహ్మణోత్తములందరికీ వందనాలు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చకులకు ఈ పవిత్ర తెలంగాణ భూమి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణ: అని నిర్వచనం చెప్పారు పెద్దలు... బ్రహ్మజ్ఞానం పొందినవారికెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది.

వేద వాజ్మయాన్ని లోకానికి అందించేవారే విప్రులు.

సర్వజన హితం సర్వజనుల సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం.

పురం యొక్క హితం కోరేవారే పురోహితులు.

లోకా సమస్త సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం.

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే.

తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే.

కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది.

• ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1 ఏర్పాటు చేసింది.

ఏడాదికి వందకోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్కు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.

విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు... ఇప్పటివరకూ 780 మంది విద్యార్థులువివేకానంద స్కాలర్షిప్' ద్వారా ఆదుకోబడ్డారు.

పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద గరిష్టంగా రూ.5 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకూ రూ.150 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.

• ‘విప్రహిత బ్రాహ్మణ సదనం’.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా బ్రాహ్మణ సంక్షేమ సదనంనిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనంను నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం.

ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, కేంద్రంగా నిలుస్తుంది.

రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుంది.

పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది.

కులమతాలకు అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను కోరుతున్నాను.

ఆ విధంగా విప్రహిత, సకల జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగత అభిమతం.

వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నాను.

ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి.

వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి.

సూర్యాపేటలో డాక్టర్ ఎ. రామయ్య గారు వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీనిని త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను.

ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది.

తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నాను.

బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభసందర్భంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.

ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 ల నుంచి రూ.5,000 లకు పెంచుతున్నాం.

ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుండి 65 ఏండ్లకు తగ్గిస్తున్నాం.

ప్రస్తుతం రాష్ట్రలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేధ్యం పథకాన్ని విస్తరింపజేస్తాం.

దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది.

ఇప్పటివరకూ ధూపదీప నైవేధ్యం పథకం కింది దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నాం.

ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తున్నాను.

వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తాం.

ఐటిఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపచేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.

అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినేట్ లో చర్చించి పరిష్కరిస్తామని హామీనిస్తున్నాం.

సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా వేద పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వాల ..వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవున్ని ప్రార్థిస్తున్నాను.

మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను.

ధర్మస్య విజయోస్తు!

అధర్మస్య నాశోస్తు

ప్రాణీషు సద్భావనాస్తు

విశ్వస్య కళ్యాణమస్తు!!..

ఓం శాంతి..శాంతి..శాంతి..

ఈ సందర్భంగా ప్రాంరభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు:

పీఠాధిపతులు:

విశాఖపట్టణం శారదాపీఠం నుంచి స్వరూపానందేంద్రస్వామి, పుష్పగిరి పీఠం నుండి విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి సుభుధేంద్ర తీర్థస్వామి, మదనానంద సరస్వతీ పీఠం నుండి మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం నుంచి విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం నుండి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, హైదరాబాద్ కు చెందిన జగన్నాథ మఠం నుంచి వ్రతధర రామానుజ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత బ్రాహ్మణ పెడరేషన్ నుంచి అధ్యక్షులు ప్రదీప్ జ్యోతి ప్రధానకార్యదర్శి ప్రధమ్ ప్రకాశ్ శర్మ, కోశాధికారి కేశవరావు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలనుంచి వచ్చిన ఫెడరేషన్ ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలనుంచి వేదపండితులు ఆహ్వానితులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, వేదపండితుడు మృత్యుంజయ శర్మ, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ఒడితెల సతీశ్, బాల్క సుమన్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, అధికారులు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, టిఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్, జస్టిస్ భాస్కర్ రావు,మాజీ డిజీపిలు అరవిందరావు, అనురాగ్ శర్మ, అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు డా. సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, పురాణం సతీష్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వి. అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాజరైన పీఠాధిపతులను సిఎం ఘనంగా సత్కరించారు.

Brahmana Sadanam at Telangana | Brahmana Sadanam at Hyderabad | 100 Crores for Brahmana Welfare | KCR | Telangana 

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP