యాదగిరిగుట్ట దేవస్థానం (వైటిడి) గౌరవ ధర్మకర్తల మండలి రెండవ సమావేశం ప్రెసిడెన్షియల్ సమావేశ మందిరము నందు నిర్వహించబడింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 26 అంశాలను ఆమోదించారు. అదనంగా 5 టేబుల్ అజెండా అంశాలను కూడా ఆమోదించారు.
సమావేశంలో ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలు:
1. దీక్షాపరుల మండపం: భక్తుల సౌకర్యార్థం కొండపైన పుష్కరిణి వద్ద సుమారు రూ.43.12 కోట్ల వ్యయంతో దీక్షాపరుల మండపం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.
2. నిత్య కళ్యాణ మండపం: బాలాలయం స్థలంలో సుమారు రూ.9.87 కోట్ల వ్యయంతో నిత్య కళ్యాణ మండపం మరియు రాయిగిరి వద్ద ప్రస్తుత ఆర్చ్ స్థానములో భారీ ఆర్చ్ ను సుమారు రూ.3.16 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఆమోదించారు. ఈ కళ్యాణ మండపాన్ని, భారీ ఆర్చ్ ను గౌరవ ధర్మకర్తల మండలి చైర్మన్ డా. ఎమ్.సత్యనారాయణ రెడ్డి గారు స్వంత ఖర్చులతో నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
3. వేద పాఠశాల, విశ్వవిద్యాలయం, మోడల్ గోశాల: దేవస్థానం పరిసర ప్రాంతంలో వేద పాఠశాల, విశ్వవిద్యాలయం మరియు 40 ఎకరాలలో మోడల్ గోశాల ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
4. అన్నప్రసాదం విస్తరణ: భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్యను ప్రస్తుత 1,500 మంది నుండి 2,000 మందికి పెంచేందుకు మరియు పరిశుభ్రత ప్రమాణాలతో అన్నప్రసాదాలను తయారు చేయడానికి అవసరమైన పరికరాలను రూ.18 లక్షలతో టెండరు ద్వారా కొనుగోలు చేయడానికి ఆమోదించారు.
5. సాంకేతిక మరియు ఆన్లైన్ సేవలు: ప్రముఖ దేవాలయాలలో అమలులో ఉన్న విధానాలను అనుసరించి, ఈ దేవస్థానంలో కూడా టీసీఎస్ (TCS) సంస్థ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తదితర సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఆమోదించారు.
6. విజన్-2047: విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు వ్యూహ పత్రము తయారు చేయుటకు ఐఎస్బి వారిని నియమించుటకు ఆమోదము తెలిపియున్నారు.
7. ప్రత్యేక సబ్కమిటీలు, కమిటీలు: దేవస్థానంలో ఆర్థిక క్రమశిక్షణ, పనుల నాణ్యత,కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత మరియు దేవస్థాన ఆస్తుల సమర్థవంతమైన నిర్వహణ కోసం గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక సబ్కమిటీలు, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.
8. దేవస్థానముపై పడు ఆర్థిక భారము తగ్గించుటకు దేవస్థాన భవన సముదాయములపై, పార్కింగ్ స్థలములో 4 మెగా వాట్లతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయుటకు ఆమోదించినారు.
9. ప్రధాన కూడళ్లలో రాతి విగ్రహాలు: దేవస్థానం పరిసర ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో గరుడాళ్వార్, యాద ఋషి, శ్రీ రామానుజులు, ప్రహ్లాదుడు మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి రాతి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.
10. రెండవ కళ్యాణకట్ట: వయోవృద్ధులు, మహిళలు మరియు చిన్నపిల్లల సౌకర్యార్థంకొండకింద దేవస్థానం అద్దె గదుల సమీపంలో రెండవ కళ్యాణకట్టను రూ.9 లక్షలతో నిర్మించేందుకు ఆమోదించారు. ఈ నిర్మాణాన్ని గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గుండా మల్లయ్య గారు స్వంత ఖర్చులతో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
11. డోనార్ మరియు పిలిగ్రిమ్ ఎమినిటి సెంటర్లు: భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొండపైన వేంచేపు మండపం పక్కన డోనార్ ఎమినిటి సెంటర్, అలాగే బస్టాండ్ ఉత్తర భాగంలో పిలిగ్రిమ్ ఎమినిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు.
12. ఎలక్ట్రానిక్ శంఖు చక్ర నామాల లైటింగ్: యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు స్పష్టంగా కనిపించే విధంగా గతంలో ఉన్న మాదిరిగా ఆలయ దక్షిణ భాగంలో ఎలక్ట్రానిక్ శంఖు చక్ర నామాలను లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. ఈ లైటింగ్ వ్యవస్థను ధర్మకర్తల మండలి సభ్యులు కొణిదెల సురేఖ గారు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
13. సోలార్ ఫెన్సింగ్: కొండపైన విష్ణు పుష్కరిణి ప్రాంతాన్ని కోతుల నుండి రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. ఈ సోలార్ ఫెన్సింగ్ను ధర్మకర్తల మండలి సభ్యులు ఈశ్వరమ్మ యాదవ్ గారు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
14. మెట్ల మార్గంలో షెడ్: భక్తుల సౌకర్యార్థం కొండకింద నుండి కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో దాతల సహకారంతో షెడ్ నిర్మాణం చేపట్టేందుకు సంబందించిన ఏం.ఓ.యు. ను ఆమోదించారు.
15. ప్రోటోకాల్ పరిధిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ప్రముఖులు వ్యక్తిగతంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయబడుతుంది. ప్రముఖుల యొక్క సిఫారసు లేఖలు / ఫోన్ సందేశముల ఆధారంగా వాహనాలు కొండపైకి ప్రవేశానికి, దర్శనం పొందేందుకు నిర్దేశించిన టిక్కెట్లను పొందవలసియుంటుంది. ఈ విధానం అందరికీ సమానమైన అవకాశాన్ని కల్పించడంతో పాటు, దర్శన వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణ మరియు నిబంధనలు అవసరమని బోర్డ్ భావించి తీర్మానించనైనది.
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly