Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Wednesday, July 1, 2026

Yadagirigutta New Trust Board | యాదగిరిగుట్ట నూతన ట్రస్ట్ బోర్డు | అసంతృప్తి లో స్థానికులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును నియమించింది (GO RT No. 392, Dated 30.6.2026). బోర్డులో వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులకు చోటు కల్పించినప్పటికీ, స్థానికులకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, భక్తులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో స్థానికుల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని, అయినప్పటికీ ట్రస్ట్ బోర్డులో వారికి తగిన స్థానం కల్పించకపోవడం, కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎవరికి స్థానం కల్పించక పోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

యాదగిరిగుట్ట వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో స్థానికుల భాగస్వామ్యం మరింత అవసరమని వారు పేర్కొంటున్నారు. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలు, భక్తుల అవసరాలు, స్థానిక పరిస్థితుల, బౌగోళిక స్థితుల పై అవగాహన ఉన్న వారిని ట్రస్ట్ బోర్డులో చేర్చి ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉండేదని అంటున్నారు.

రెవెన్యూ (దేవాదాయ శాఖ.I) డిపార్ట్‌మెంట్ – యాదగిరిగుట్ట దేవస్థానం (YTD) – తెలంగాణ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ (సవరణ) చట్టం, 2025 లోని సెక్షన్ 96 ప్రకారం యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు లో ఈ క్రింద తెలిపిన వారికి స్థానం కల్పించారు, వీరి పాలన వచ్చే రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.
1. శ్రీ ఎం. సత్యనారాయణ రెడ్డి - *ఛైర్మన్*
2. శ్రీ వినోద్ వెంకటస్వామి, ఎమ్మెల్యే - *సభ్యుడు*
3. శ్రీమతి కొణిదెల సురేఖ - *సభ్యురాలు*
4. శ్రీమతి చిలప్పగారి విజయరాజం - *సభ్యురాలు*
5. శ్రీ విజయేందర్ తుల్లా - *సభ్యుడు*
6. శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ - *సభ్యురాలు*
7. శ్రీ గుండు మల్లయ్య - *సభ్యుడు*
8. శ్రీమతి స్వాతి కంతమణి - *సభ్యురాలు*
9. శ్రీ ఎం. రాఘవేందర్ రావు - *సభ్యుడు*
10. డా. లక్ష్మీనారాయణ నాయక్ - *సభ్యుడు*
11. ది ఫౌండర్ ట్రస్టీ - *సభ్యుడు*
12. చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
13. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవెన్యూ (దేవాదాయ) శాఖ, తెలంగాణ ప్రభుత్వం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
14. కమీషనర్, దేవాదాయ శాఖ, తెలంగాణ, హైదరాబాద్ - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
15. జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
16. వైస్ ఛైర్మన్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
17. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యాదగిరిగుట్ట దేవస్థానం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
18. స్థానాచార్యులు లేదా సీనియర్-మోస్ట్ ప్రధాన అర్చకులు - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
Yadagirigutta Trust Board, #YTD #YTDA #yadagirigutta #yadadri #revanthreddy #kcr




Read more...

Sunday, March 8, 2026

Sri Vaishno Devi Kuchipudi Dance in Yadadri Giripradakshina | యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ లో వైష్ణో దేవి కూచిపూడి నృత్య ప్రదర్శన

కళ, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి. శ్రీ వైష్ణో దేవి, స్వాతి నక్షత్రం పుణ్యదినాన Sri Lakshmi Narasimha Swamy Devasthanam లో జరుగుతున్న పవిత్ర గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేకమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను అందించారు. తెలంగాణలో ఇదే తొలిసారి ఈ విధమైన వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది.

స్వాతి నక్షత్రం రోజు Lord Lakshmi Narasimha స్వామివారికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి, ఐశ్వర్యం మరియు రక్షణ కోసం స్వామివారి ఆశీర్వాదాలను కోరుకుంటారు.

ఈ సందర్భంగా చిన్నారి వైష్ణో దేవి మొత్తం 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గమంతా నిరంతరంగా కూచిపూడి నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది భక్తులు ఆమె అద్భుత నృత్యాన్ని ఆసక్తిగా వీక్షించి ప్రశంసించారు. ప్రదక్షిణ పూర్తయ్యాక పలువురు భక్తులు ఆమెతో కలిసి ఫోటోలు తీసుకుని అభినందించారు.

ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే Beerla Ilaiah, ఆలయ ఈఓ, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు భక్తులు హాజరయ్యారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య అభినందిస్తూ, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో భారతీయ సాంప్రదాయ కళలను ప్రోత్సహించే మంచి ప్రయత్నమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణగా వైష్ణో దేవి కుటుంబ సభ్యులు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ముఖ్యంగా 86 ఏళ్ల వయస్సు గల ఆమె ముత్తాతమ్మలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మహిళలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండి జీవితాన్ని సంతోషంగా నడిపించుకోవాలని సందేశం ఇచ్చారు.

ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనను జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైష్ణో దేవి గత ఐదేళ్లుగా తన గురువు శ్రీమతి జ్యోతి రెడ్డి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తోంది.

ఈ సందర్భంగా గురువు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ,

“గురువుగా ఈ రోజు నాకు ఎంతో గర్వంగా మరియు ఆనందంగా ఉంది. వైష్ణో దేవి ఐదేళ్లుగా నా వద్ద కూచిపూడి నేర్చుకుంటోంది. మొదటి నుంచి ఆమె అమాయకత్వం, నృత్యంపై ఉన్న ప్రేమ ప్రత్యేకంగా కనిపించాయి. ఆమె క్రమశిక్షణ, అంకితభావం ఎంతో ప్రశంసనీయమైనవి. చిన్న వయస్సులోనే బాధ్యత, సంస్కారం మరియు మంచి ప్రవర్తనను అలవరుచుకుంది. ఆమె మంచి నర్తకిగా మాత్రమే కాకుండా మంచి మనిషిగా కూడా ఎదుగుతోంది. ఆలయంలో ఈ రోజు చేసిన ప్రదర్శన ఆమె ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. భవిష్యత్తులో కూడా ఆమె మా నృత్య సంప్రదాయానికి గౌరవం తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ నృత్య ప్రదర్శన వైష్ణో దేవికి ఒక ఆధ్యాత్మిక సమర్పణగా నిలిచింది. తన తాతమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆరోగ్యం మరియు ఆనందం కోసం స్వామివారి ఆశీర్వాదాలు కోరుతూ ఈ గిరి ప్రదక్షిణలో నృత్యం చేసింది.

ఈ సందర్భంగా పి. శ్రీ వైష్ణో దేవి మాట్లాడుతూ, “గిరి ప్రదక్షిణ సమయంలో నృత్యం చేయడం నాకు చాలా ప్రత్యేకమైన మరియు ఆధ్యాత్మిక అనుభూతి. నా తాతమ్మల ఆరోగ్యం కోసం మరియు స్వామివారి ఆశీర్వాదాల కోసం ఈ నృత్యాన్ని సమర్పించాను. వేలాది మంది భక్తుల మధ్య నృత్యం చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది” అని తెలిపారు.

ఆమె తల్లి పి. వినయా దేవి మాట్లాడుతూ, “ఇంత చిన్న వయస్సులోనే వైష్ణో దేవి తన కళను భక్తితో సమర్పించడం చూసి తల్లిదండ్రులుగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు ఇంత మంచి మార్గదర్శకత్వం ఇచ్చిన జ్యోతి రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఈ ప్రదర్శన నృత్యం మాత్రమే కాదు, భక్తి, కుటుంబ ప్రేమ మరియు విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యరూపమైన కూచిపూడి భక్తి భావాన్ని వ్యక్తపరచే శక్తివంతమైన కళారూపమని మరోసారి స్పష్టమైంది. గిరి ప్రదక్షిణ పవిత్ర మార్గంలో నృత్యాన్ని సమర్పించడం ద్వారా వైష్ణో దేవి కళ, భక్తి మరియు యువత యొక్క అంకితభావం కలిసిన ఒక ప్రత్యేకమైన క్షణాన్ని సృష్టించి వేలాది మంది భక్తులను ప్రేరేపించింది. 



#SriVaishnoDevi #vaishnodevi #kuchipudi #yadadri #yadagirigutta #giripradakshina 

Read more...

Tuesday, February 17, 2026

Yadagirigutta Brahmotsavam 2026 | Preparations going on

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ శుభ పర్వాన్ని పురస్కరించుకుని, యాదగిరిగుట్ట ప్రధాన రహదారిని, కొండపైన ఆలయ పరిసరాలను విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.

బ్రహ్మోత్సవాలు 18-02-2026 నుండి 28-08-2026 వరకు.
ప్రధాన ఘట్టాలు.
24-02-2026 శ్రీ స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం
25-02-2026 శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
26-02-2026 శ్రీ స్వామి వారి దివ్య విమాన రథోత్సవం
 








  

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP