ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును నియమించింది ( GO RT No. 392, Dated 30.6.2026) . బోర్డులో వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులకు చోటు కల్పించినప్పటికీ, స్థానికులకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, భక్తులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో స్థానికుల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని, అయినప్పటికీ ట్రస్ట్ బోర్డులో వారికి తగిన స్థానం కల్పించకపోవడం, కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎవరికి స్థానం కల్పించక పోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యాదగిరిగుట్ట వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో స్థానికుల భాగస్వామ్యం మరింత అవసరమని వారు పేర్కొంటున్నారు. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలు, భక్తుల అవసరాలు, స్థానిక పరిస్థితుల, బౌగోళిక స్థితుల పై అవగాహన ఉన్న వారిని ట్రస్ట్ బోర్డులో చేర్చి ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉండేదని అంటున్నారు. రెవెన్యూ ...
- Get link
- X
- Other Apps