Yadagirigutta Vaikunta Ekadashi on 30-12-2025
Yadagirigutta Devasthanam Vaikunta Ekadashi will be celebrated on 30-12-2025 at 5:30 AM
Read more...
Read more...
వివరాలకు : 9912345190, 8333993244, 8333994007, 8333994023,
#yadadri #yadagirigutta yadadri satyanarayana Vratham
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం, కుంభాభిషేకం తరువాత కొండపైన పెద్దగా నిర్మించిన బస్ స్టాండ్ కి రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు వస్తాయని అందరూ అనుకున్నారు. YTDA ప్లాన్ ప్రకారం కూడా రాష్ట్రం లోని కొన్ని పట్టణాలనుంచి యాదగిరి కొండపైకి నేరుగా బస్సులను నడపాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇవ్వన్నీ పక్కన పెట్టి, కొండపై ఉన్న బస్టాండ్ ను పార్కింగ్ కి, దుకాణాల సముదాయనికి వాడుకోవడం విడ్డూరంగా ఉందని భక్తులు, స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.
గతంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రతి రోజు యాదగిరిగుట్ట కు ఏసి బస్సులు కొండ క్రింది బస్టాండ్ వరకు వచ్చేవి. అలాగే నగరం నుంచి కొండపైకి నేరుగా వజ్ర మిని ఏసి బస్సులు నడిచేవి, వీటికి ఆన్ లైన్ లో టికిట్ బుకింగ్, సీట్ సెలక్షన్ ఉండేది. ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండడం తో వాళ్ళు ఆన్ లైన్ లోనే బుకింగ్ చేసుకొని వచ్చి పోయే వారు. కరొన లాక్ డౌన్ లో రద్దు అయిన ఈ సర్వీసులు ఇంతవరకు మళ్ళీ మొదలు కాలేదు.
తెలంగాణ ఆర్టీసీ
రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం ఇతర బస్సులకు కల్పించింది. కానీ, యాదగిరిగుట్ట
కు వచ్చే బస్సులకు ఎలాంటి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా
వినియోగదారుడు అప్డేట్ అవుతున్న
సంస్థలు కాక పోవడం విచారకరమనీ ప్రయాణికులు అనుకుంటున్నారు. సీట్ల కోసం ఫీట్లు చేసే
ప్రయాణికులని, సీట్ల కోసం కొట్టుకునే వారిని మనం తరచుగా బస్సులో, బస్టాండ్ లలో చూస్తున్నాం.
కొండపై బస్టాండ్లో, యాదగిరిగుట్ట బస్టాండ్ లో కూడా ఇలాంటి సంఘటనలు మనం వార్తల ద్వారా
చూశాం. ఆల్ లైన్ బుకింగ్ తో వీటన్నటికి చెక్ పెట్టె అవకాశముంటుంది అని విశ్లేషకులు
అంటున్నారు.
ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా కొండపైకి నేరుగా బస్సులను నడిపే అంశాన్ని, ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యంతో రాష్ట్రం లోని ముఖ్య పట్టణాల నుంచి మిని లగ్జరీ, డీలక్స్ బస్సుల ను నడిపే అంశాన్ని పరిశీలించి, ప్రారంబించాలని భక్తులు కోరుకుంటున్నారు.
గతంలో కొండపైకి నడిచిన వజ్ర బస్సులను చిత్రాలలో చూడవచ్చు.
Read more...డెన్మార్క్ దేశస్తురాలైన విక్టోరియా క్లార్, ఇటీవల 2024 మిస్ యూనివర్స్ హోదాను సాధించిన ప్రముఖ సౌందర్య రాణి, భారతదేశంలోని సంప్రదాయ మరియు ధార్మిక ప్రదేశాలను సందర్శించడం కోసం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆమెకు యాదగిరిగుట్ట ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగింది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె యాదగిరిగుట్టలో పూజలు నిర్వహించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
యాదగిరిగుట్ట ను సందర్శించిన మొట్ట మొదటి విశ్వ సుందరిగా విక్టోరియా క్లార్ ఆలయ రికార్డులో నిలుస్తారు. ఆమె సందర్శన ఆమె తో పాటు అక్కడ ఉన్న భక్తులకు, స్థానికులకు ఒక మరిచిపోలేని అనుభూతి గా నిలుస్తుందండంలో అతిశయోక్తి లేదు.
#yadadri #yadagirigutta #Telangana #MissUniverse #missuniversedenmark2024 #MissUniverse2024 #VictoriaKjærTheilvig
![]() |
| | ఊహాచిత్రం | |
యాదాద్రి యాదగిరిగుట్ట లో తిష్ట వేసిన పలు సమస్యలలో ఒకటి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. 1983 లో అంటే, దాదాపు 41 సంవత్సరాలు గడిచిన దీనికి ఒక శాశ్వత భవనం లేదు, ఆనాడు గాంధీనగర్ లోని ఒక అద్దె భవనంలో మొదలైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అటు తరువాయి నల్ల పోచమ్మ వాడ లోని మరో అద్దె భవనంలోకి మారింది. తాజాగా ఇప్పుడు యాదగిరిపల్లి లోని మరో అద్దె భవనంలో కొనసాగుతుంది.
గత 20 ఏళ్లలో విపరీతంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పెరగడం, ముఖ్యంగా యాదాద్రి పునర్నిర్మాణం, హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ ప్రకటనలు రావడంతో ఇక్కడి రిజిస్ట్రేషన్ లు గతంలో విపరీతంగా పెరిగాయి. రాష్ట్రం లోనే మంచి ఆదాయమున్న కార్యాలయంగా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పేరుగాంచింది. అయితే వచ్చే పౌరులకు తగిన సదుపాయాలు కరువైనాయి. అద్దె భవనాల్లో, గృహ వినియోగం కోసం నిర్మించిన భవనాల్లో కార్యాలయాలు పెట్టడంతో తగిన సదుపాయాలు పౌరులకు కల్పించలేకపోయారు, ముఖ్యంగా వచ్చే పౌరులు తమ నెంబర్ వచ్చే వరకు వేచి ఉండడానికి తగిన వసతి లేకపోవడం, స్త్రీ పురుషులకు తగిన టాయిలెట్లు లేక పోవడం వగైరా ఇబ్బందులు పౌరులకు ఎదురవతున్నాయి.
గత ప్రభుత్వంలో యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయనికి శాశ్వత భవన నిర్మాణానికి యాదగిరిపల్లి చెరువు దగ్గర శంకుస్థాపన చేశారు. కానీ ఆ స్థలం అంతా యాదాద్రి రింగ్ రోడ్డు నిర్మాణంలో కలిసిపోవడం తో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. గతంలో చాలా మంది రియల్టర్ లు తమ వెంచర్లలో భవన నిర్మాణానికి ఉచిత స్థలం ఇస్తామని ముందుకు వచ్చిన ప్రభుత్వం నుంచి సరి అయిన స్పందన లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుత ప్రజపాలన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. వీటిని కార్పొరేట్ సామాజిక బాద్యత (CSR) నిధులతో నిర్మించాలని అనుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 114 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో 37 కార్యాలయాలకు మాత్రమే స్వంత భవనాలు ఉన్నాయని మిగతా వాటికి లేవు అని తేలింది. అందులో యాదగిరిగుట్ట కార్యాలయం ఒకటి. ప్రభుత్వ ఆలోచన ప్రకారం విశాలమైన స్థలంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండకుండా ఆయా భవనాల్లోనే అన్నీ రకాల వసతులతో కార్పొరేట్ స్తాయిలో ఈ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఆయా జిల్లా కలెక్టర్ లకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశాలిచ్చారు. మొదటగా ఒక మోడల్ కార్యాలయం హైదరాబాద్ లో నిర్మించుటకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు.
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిన ఈ తరుణంలో, ఇప్పటికైన స్థానిక అధికారులు, నాయకులు స్పందించి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి యాదగిరిగుట్ట లో ఒక శాశ్వత భవనం అందరికీ అందుబాటులో ఉండే అనువైన ప్రదేశంలో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
#yadadri #yadagirigutta #SROYadagirigutta Yadagirigutta Sub Registrar Office
© Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008
Back to TOP